వర్షాలు బాగా కురవాలని ‘అల్లా’ను ప్రార్ధించండి-హారీష్‌ రావు

274
Harish rao
- Advertisement -

ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మదిన పంక్షన్ హల్ నిర్వహించిన హజ్ యాత్రికుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ.. హిందువులకు కాశి, ముస్లింలకు హజ్ యాత్రకు వెళ్లడం ఒక కళలని.. ప్రతి ఏడాది సొంత ఖర్చులతో5 మందిని హజ్ యాత్రకు పంపిస్తున్నామన్నారు.

సిద్దిపేటలో నిర్మిస్తున్న హజ్ భవనం మాదిరి ఇతర పట్టణాల్లో కూడా నిర్మిస్తామన్నారు. 3కోట్ల25 లక్షలతో నిర్మించిన హజ్ భవనాన్ని ఈ నెల25 రోజున ప్రారంభిస్తామని హారీష్‌ రావు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు మండల గ్రామ కేంద్రలలో నిర్వహించాలి.తెలంగాణలో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అల్లాను ప్రార్ధించండి అని ఎమ్మెల్యే హరీష్‌ రావు తెలిపారు.

- Advertisement -