తెలంగాణ మట్టి వాసనల మకరందం మన బోనాలుః మాజీ ఎంపీ కవిత

386
KAVITHA
- Advertisement -

పవిత్రమైన ఆషాడ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభమైన సంగతి తెలిసిందే. గురువారం గోల్కొండ లో బోనాల పండుగ ప్రారంభమైంది. ఈసందర్భంగా ప్రతి గురువారం, ఆదివారం బోనాల పండుగను జరుపుకోనున్నారు. బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షాలు తెలిపారు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

తెలంగాణ మట్టి వాసనల మకరందం మన బోనాల పండుగ. స్త్రీని అమ్మగా ఆదిశక్తిగా కొలిచే మహోన్నత సాంస్కృతిక వారసత్వం ఇది. బోనాలు నేటి నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షాలు. ఆ అమ్మల గన్న అమ్మ చల్లని దయ మనందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -