మిస్ వరల్డ్‌గా కరోలీనా బీలాస్కా..

182
- Advertisement -

పోలెండ్‌కు చెందిన అందాల భామ కరోలీనా బీలాస్కా మిస్ వరల్డ్ 2021 కిరీటాన్ని సొంతం చేసుకుంది. పోర్టోరికోలోని శాన్ జువాన్ కోకా కోలా మ్యూజిక్ హాల్ లో జరిగిన ఈ ప్రపంచ అందాల పోటీల్లో ఆమెను న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించారు.మాజీ మిస్ వరల్డ్ టోనీ యాన్ సింగ్ నుంచి కిరీటం తీసుకున్న వెంటనే.. ఆమె భావోద్వేగానికి లోనైంది. ఈ నిజాన్ని తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పింది. ఈ ఘట్టాన్ని తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. కాగా, అమెరికాకు చెందిన భారతీయ సంతతి ముద్దుగుమ్మ శ్రీసైని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. కోట్ ది ఐవరీకి చెందిన ఒలీవియా యేస్ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

ఇక మిస్ వరల్డ్ పోటీలకు 40 మంది సెమీ ఫైనల్ కు వచ్చారు. వాస్తవానికి గత ఏడాది డిసెంబర్ లోనే ఫైనల్స్ ను నిర్వహించాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా వేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు చెందిన అందాల భామలు మిస్ వరల్డ్ పోటీల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. భారత్ తరఫున హైదరాబాద్ అమ్మాయి మానస వారణాసి పోటీ పడినా ఆమెను అదృష్టం వరించలేదు. టాప్ 13కు మాత్రమే తను పరిమితమైంది.

- Advertisement -