గణేశ్ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలులేవు:తలసాని

195
talasani srinivas
- Advertisement -

గణేశ్‌ విగ్రహాల ఎత్తుపై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రేటర్ హైద్రాబాద్ లో గణేష్ ఉత్సవాల నిర్వహణ పై ఎంసీఆర్ హెచ్చార్డి లో మంత్రుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగరంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ శ్వేతా మహంతి, డీజీపీ మహేందర్ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

కోవిడ్ నేపథ్యంలో గణేష్ ఉత్సవ సమితి సభ్యులతో చర్చించామని… నిషేధాలు పెట్టాలని ప్రభుత్వానికి లేదున్నారు. ఉత్సవాలపై తుది నిర్ణయం వచ్చే సమావేశంలో తీసుకుంటామని…. ఎత్తు పై ఎలాంటి ఆంక్షలు లేవన్నారు.

- Advertisement -