SNDPతో నాలాలకు మహర్దశ- మంత్రి తలసాని

106
- Advertisement -

సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం (SNDP)తో నాలాలకు మహర్దశ పట్టనున్నదని జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని తెలిపారు. గురువారం ఆయన ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నాలా అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మాగంటి గోపినాధ్, మాధవరం కృష్ణారావు, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్ షాహీనా బేగం, సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ,తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమం ద్వారా నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్ నియోజకవర్గాల పరిధిలో గల ఏజీ కాలనీ నుండి సనత్ నగర్ నాలా వరకు 2,423 మీటర్లు ఉండగా, ఇందులో మొదటి విడతలో 830 మీటర్ల నాలా అభివృద్ధి పనుల కోసం 12.36 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పారు. ఈ నిధులతో నాలా కు రిటైనింగ్ వాల్స్, బాక్స్ డ్రెయిన్ ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి విడతలో చేపట్టే నాలా అభివృద్ధి పనులతో ఎర్రగడ్డ మెట్రో స్టేషన్, ఆనంద్ నగర్, ప్రేం నగర్, సుల్తాన్ నగర్, తదితర ప్రాంతాల ప్రజలు ఎన్నో సంవత్సరాల నుండి వరదనీటి ముంపుతో పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు.

అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్‌ఎన్‌డీపీ కార్యక్రమంతో ఎన్నో సంవత్సరాల నుండి వివిధ నాలాల పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కానున్నదని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కోట్లాది రూపాయల ఖర్చుతో సీవరేజ్ సమస్య పరిష్కారానికి పాత పైప్ లైన్ లను తొలగించి సామర్ద్యం పెంచడం, అవసరమైన చోట్ల నూతన పైప్ లైన్ ల ఏర్పాటు, ట్రాఫిక్ రద్దీ అధిగమించేలా రహదారుల అభివృద్ధి, నూతన ఫ్లై ఓవర్ లు, అండర్ పాస్ ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌డీపీ సీఈ కిషన్, ఎస్‌ఈ భాస్కర్ రెడ్డి, ఈఈ శ్రీనివాస్, డీఈ బసిదర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -