ఐదో షోకు అనుమతి- మెగాస్టార్‌ చిరు

96
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ ధరలకు సంబంధించి శుభంకార్డు పడిందని భావిస్తున్నట్లు నటుడు చిరంజీవి వెల్లడించారు. సీఎం జగన్‌ నిర్ణయం మమ్మల్ని అందరినీ సంతోషపరిచిందని తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరు మాట్లాడుతూ.. చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామని చెప్పారు.

ఈ నెల మూడో వారంలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారాలకు సంబంధించి ప్రభుత్వం జీవో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పెద్దలకు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. చిరంజీవి, ప్రభాస్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్‌ నారాయణ మూర్తి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు.

- Advertisement -