గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న యాంకర్ జాను..

53
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యాంకర్ జాను ఈరోజు ప్రశాసన్ నగర్ జిఎచెంసి పార్కులో మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా జాను మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే అవకాశం కల్పించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి యాంకర్ జాను కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం జోర్డార్ సునీత,శ్రీముఖి, దీప్తి సునైన ముగ్గురికి గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు జాను.

- Advertisement -