బాల్క సుమన్‌ను పరామర్శించిన మంత్రి తలసాని..

134
Minister Talasani
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి సురేష్ ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. ఈ రోజు రేగుంట (మెట్ పల్లి) లోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరామర్శించారు. బాల్క సురేశ్ చిత్రపటానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న బాల్క సుమన్ ను మంత్రి తలసాని పరామర్శించారు.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్ , ఎంపీ వెంకటేష్ నేత , ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , ఎమ్మెల్యేలు శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , సంజయ్ కుమార్ , ఏ. జీవన్ రెడ్డి , కోరుకంటి చందర్ ,దాసరి మనోహర్ రెడ్డి , సుంకె రవి శంకర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -