సీఎస్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ..

255
srinivas goud
- Advertisement -

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌తో సచివాలయంలో భేటి అయ్యారు. ఈ భేటిలో అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులందరికి అన్ని శాఖల్లో ప్రమోషన్ లను జనవరి 31 లోగా ఇవ్వడంపై చర్చించారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ లలో మినిమం సర్వీస్‌ను 3 ఏండ్ల నుండి 2 యేండ్లకు తగ్గించి ప్రమోషన్ లను ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సీఎస్ సోమేష్ కుమార్‌తో చర్చించారు.

- Advertisement -