ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పువ్వాడ అజయ్

446
Puvvada Ajay In Rtc Bus
- Advertisement -

ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఖమ్మం నుంచి కొత్తగూడెం వరకు బస్సులో ప్రయాణించారు. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యే రాములు నాయక్ లు ఈ బస్సులో ప్రయాణించారు. ప్రజా ప్రతినిధులు నెలకు ఒకసారి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని లేఖ రాశారు మంత్రి.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ….ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆర్టీసీ బాగుకోసం సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. త్వరలోనే ఆర్టీసీలో కార్గో సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సహకారంతో సంవత్సరం తర్వాత మార్పు చూపిస్తామన్నారు. నిర్మాణంలో ఉన్న బస్టాండ్లను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు చెప్పారు.

- Advertisement -