అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి వేముల..

466
Minister Prashanth Reddy
- Advertisement -

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి హరితహారంలో భాగంగా బావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మొక్కలు నాటారు.

Minister Prashanth Reddy

భవిష్యత్ తరాలకు మనమిచ్చే సంపద పర్యావరణ పరిరక్షణ మాత్రమే అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టారని గుర్తు చేసారు. దాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను మంత్రి వేముల ప్రశంసించారు.ఎంపీ సంతోష్ ఇచ్చిన స్ఫూర్తిని అందరూ స్వీకరించి విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

తన జన్మదినం సందర్భంగా ట్వీట్ చేసిన గవర్నర్ తమిళ సై సౌందర రాజన్,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్,ఎంపీ జె.సంతోష్ కుమార్ లకు మంత్రి ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్ శర్మ,టిఆర్ఎస్ఎల్పీ ఇంచార్జి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Minister Prashanth Reddy

- Advertisement -