వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలి- మంత్రి వేముల

224
Minister Prashanth Reddy
- Advertisement -

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అధ్యక్షతన ఈ రోజు షాద్ నగర్‌లో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి పాలమూరు జిల్లా పట్టభద్రుల ఎన్నికల సమన్వయ కర్తగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరైయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టిఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అందుకోసం ప్రతి గులాబీ సైనికుడు కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కోరారు. ఈ కార్యాక్రమానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి పలువురు ప్రజాప్రతినిధులు,పార్టీనాయకులు పాల్గొన్నారు.

- Advertisement -