పసుపు మద్దతు ధర పెంపుపై మంత్రుల సమావేశం

309
niranjanreddy
- Advertisement -

హైదరాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నాణ్యత పెంపు, మార్కెటింగ్, వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళిక, మద్దతుధరలపై సమీక్ష నిర్వహించారు మంత్రులు నిరంజన్ రెడ్డి,ఇంద్రకరణ్ రెడ్డి,వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు పసుపు మార్కెటింగ్ లో కేంద్రం విఫలం అయిందన్నారు.

పసుపు లేని వంట ఉండదని కానీ రైతులకు మద్దతు ధర లేదన్నారు. అనాదిగా ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర అసమర్థతకు నిదర్శనం అన్నారు. అలెప్పీ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని… అదే రకాన్ని ఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందించడం జరిగిందన్నారు. నాణ్యతను పెంచడంతో పాటు, ఎగుమతుల మీద దృష్టి సారించాలని.. అన్ పాలిష్డ్ పసుపుతో రైతులు నష్టపోతున్నారని చెప్పారు.

పండించిన పంటను ఉడికించి, ఎండబెట్టి మార్కెట్ కు తెస్తున్నారు.. 900 ఏళ్లుగా పసుపు సాగును సాంప్రదాయంగా సాగు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వమే పసుపును తీసుకుని ప్రాసెసింగ్ చేసే అవకాశాల మీద దృష్టి సారించాలని.. పసుపులో కర్క్ మెన్ శాతం పెంచితే ఎగుమతులు పెరిగి మద్దతుధర లభిస్తుందన్నారు.
ప్రపంచంలో పసుపు వాడకం తక్కువ .. కలర్స్, ఫార్మా రంగాలలో దీని వినియోగం పెంచితే బాగుంటుందన్నారు. పసుపులో సిండికేట్ దోపిడి ఉందని.. 1.33 లక్షల ఎకరాలలో రూ.1687 కోట్ల విలువైన 2.81 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుందన్నారు.

పసుపులో కల్తీని పూర్థిస్థాయిలో అరికట్టాలని.. పీపీపీ మోడల్ లో పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించాలన్నారు. పతంజలి లాంటి సంస్థలకు వసతులు కల్పిస్తే మన పసుపును పూర్తిగా వారే కొంటారేమో ప్రయత్నాలు చేయాలన్నారు. పసుపు వినియోగం పెంచే అవకాశాలు, నాణ్యమైన పసుపు వంగడాలు రైతులకు అందించి దిగుబడి పెంచే ప్రయత్నించాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళికతో ఏం చేయగలం ? స్వల్పకాలికంగా రైతులకు ఏం చేయగలం ? అనే అంశంపై కమిటీ నియమించి నివేదిక వచ్చిన తరువాత చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్దాం అన్నారు మంత్రులు.

- Advertisement -