గ్రీన్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న సినీ నిర్మాతలు..

493
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు సినీ నిర్మాతలు,నటులు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గరలోని GHMC పార్క్ లో మొక్కలు నాటారు. నిర్మాతలు కేఎస్ రామారావు, రాజ్ కందుకూరి, సింగర్ ఆర్పీ పట్నాయక్, నటులు శివాజీ రాజా,ఏడిద శ్రీరామ్, బెనర్జీ, కాశీ విశ్వనాద్ కందుకూరి శివ, భవానీ ప్రసాద్, కాదంబరి కిరణ్ తదితరులు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ రోజు రోజుకు ఎంతో గొప్పగా సాగుతుందన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ఇప్పటికే 5 కోట్ల మొక్కలకు పైగా నాటడం ఎంతో గొప్ప విషయం అన్నారు. పచ్చదనం పెంచడం కోసం ఎంపీ సంతోష్ తీసుకున్న చర్యలు ప్రశంస నీయం అన్నారు ఏడిద శ్రీరామ్‌. ప్రజలు భారీగా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాలు పంచుకోవాలన్నారు.

ఎంపీ సంతోష్ పెద్ద భాద్యత ఎత్తుకున్నారని…కోట్లాది మొక్కలు నాటడం అంత ఆషామాషీ కాదన్నారు శివాజీ రాజా. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా 50 కోట్ల మొక్కలు నాటాలన్నారు రాజ్ కందుకూరి. ఇలాంటి గొప్ప కార్యక్రమం తీసుకున్న ఎంపీ సంతోష్ కి ధన్యవాదాలు తెలిపారు.

ఎంపీ సంతోష్ గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు కాశీ విశ్వనాథ్. ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలపాలన్నారు. మా సెలెబ్రెటీలను చూసి మరికొంత మంది మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలన్నారు ఆర్పీ పట్నాయక్. ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న ఎంపీ సంతోష్ కి శుభాకాంక్షలు తెలిపారు.

చెట్లను నాటాల్సిన అవసరం పెరిగిందని.. ప్రతిఒక్కరు ఈ గొప్ప పనిలో భాగ స్వామ్యం కావాలన్నారు హీరో కందుకూరి శివ. ఇలాంటి గొప్ప కార్యక్రమం చేపట్టినా ఎంపీ సంతోష్ కి చేతులెత్తి మొక్కుతున్నానని..మొక్కలు నాటుతూ..నాటిస్తూ ఎంతో మంది కి ఆక్సిజన్ అందిస్తున్నారని చెప్పారు బెనర్జీ.

green challenge green challenge green challenge

- Advertisement -