కేంద్రానికి మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ..

442
Minister Niranjan Reddy
- Advertisement -

పప్పుశనగ మద్దతుధరకు కొనుగోలు చేసే కోటా పరిమితి పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లేఖ రాశారు. ఈ సంతర్భంగా ఆయన మాట్లాడుతూ.. పప్పుశనగ కొనుగోలు కోటా పెంచండి. తెలంగాణ రాష్ట్రంలో 47,600 మెట్రిక్ టన్నుల పప్పుశనగ కొనుగోలుకు మాత్రమే అనుమతించారని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 1.46 లక్షల హెక్టార్లలో పప్పుశనగ సాగు చేశారు. హెక్టారుకు 12.95 క్వింటాళ్ల చొప్పున 1.89 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. అయితే కేంద్రం అనుమతించిన దానిలో నిన్నటి (04/04/2020) వరకు 12,963 మంది రైతుల నుండి 19,876.10 మెట్రిక్ టన్నుల పప్పుశనగకు ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.4875 కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

మరో 27,830 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు అదనంగా అనుమతివ్వండి అని మంత్రి నిరంజన్‌ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆ లెక్కన కూడా 75,430 మెట్రిక్ టన్నులు అంటే రాష్ట్రంలో వచ్చిన దిగుబడిలో 40 శాతం పంట మాత్రమే మద్దతుధరకు కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు అవుతుందన్నారు.

రైతుల శ్రేయస్సు, సాగుకు ప్రోత్సాహం అందించేందుకు వెంటనే నిర్ణయం తీసుకొంటూ ఆదేశాలు జారీచేయండి. పప్పుశనగ మద్దతుధరకు కొనుగోలు చేసే కోటా పరిమితి పెంచాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ పంపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -