‘బోర్లాగ్’ సదస్సుకు మంత్రి నిరంజన్ రెడ్డి

36
- Advertisement -

బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకానున్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ మేరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.పదేళ్ల తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్ స్టాడ్ . తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి ప్రత్యేకంగా ఆహ్వానించింది బోర్లాగ్ సదస్సు.

ఈ నెల 24 నుండి 26 వరకు అమెరికాలోని అయోవా రాష్ట్రం డెమోయిన్ నగరంలో సదస్సులో ప్రసంగించనున్నారు మంత్రులు కేటీఆర్, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీద ప్రతి ఏటా సదస్సులు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యవసాయరంగంలో ఆహార భద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

Also Read:రూ.112కే మల్టీప్లెక్స్‌లో ‘ద్రోహి’

ప్రపంచ దేశాల నుండి హాజరుకానున్న 1200 మంది .. ఆన్ లైన్ మాధ్యమంలో వేలాది మంది పాల్గొననున్నారు. ఈ నెల 22 నుండి 29 వరకు అమెరికాలో మంత్రులు కేటీఆర్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు పాల్గొననున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ సీడ్స్ ఎండీ డాక్టర్ కేశవులు బృందం పర్యటించనుంది.

Also Read:బెయిలా,కస్టడీనా.. టెన్షన్ లో టీడీపీ?

- Advertisement -