Bigg Boss 7 Telugu:వైల్డ్ కార్డు ద్వారా 5గురు ఎంట్రీ

37
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. 5వ వారంలో భాగంగా ఇంటి నుండి శుభశ్రీ ఎలిమినేట్ కాగా గౌతమ్‌ని సీక్రెట్ రూమ్‌లో ఉంచారు. ఇక ఉల్టా పల్టా సీజన్ కాబట్టి ఈ సారి ఎవరు ఊహించని విధంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను దింపారు. అర్జున్ అంబటి, నయని పావని, భోలే షావలి, అశ్విని శ్రీతో పాటు సీరియల్ నటి పూజా మూర్తి కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే వైల్డ్ కార్డు ద్వారా 5 గురు ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి.

బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తరువాత హౌస్‌లోకి వచ్చే ఒక్కరోజు ముందే మా నాన్న గారు చనిపోయారు.. సాయంత్రమే నాతో మాట్లాడారు. బిగ్ బాస్‌కి వెళ్తున్నావ్.. స్ట్రాంగ్‌గా ఆడు.. స్ట్రాంగ్‌గా ఉండు అని ధైర్యం చెప్పారు.. కానీ అరగంటలోనే లైఫ్‌లో జరగని నష్టం జరిగిపోయింది అంటూ పూజా కన్నీళ్లు పెట్టుకుంది. నాకు తగిలిన దెబ్బ నుంచి రికవరీ కాలేదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లు.. నేను చూస్తాను అని నాన్నగారు అన్నారు. ఆయన కోరిక కోసమే వచ్చానని చెప్పారు పూజా. ఇక హౌస్‌లో దమ్మున్న వాళ్లంటే శివాజీ గారని పూజా చెప్పింది. ఆయన మాట మార్చరు. అలానే సందీప్ ఆడుతున్నారని చెప్పింది.

Also Read:వరుస భేటీలు.. కాంగ్రెస్ తేల్చేడెప్పుడు?

తర్వాత సూపర్ హాట్ పెర్ఫామెన్స్‌తో ఎంట్రీ ఇచ్చిన నయనిని నాగార్జున రెండు ప్రశ్నలు అడిగారు. హౌస్‌లో దమ్ముగా ఆడుతున్నది ఎవరూ అని అడిగితే యావర్, ప్రశాంత్ పేర్లు చెప్పింది నయని . ఇక చెత్తగా ఆడుతున్న ఇద్దరు ఎవరని అడిగితే అమర్, తేజ అంటూ చెప్పేసింది.

టీవీలో యావర్-తేజ-ప్రశాంత్ ఫొటోలు పెట్టి ఇందులో ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తావ్, ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి చేసుకుంటావ్ చెప్పమని అడగ్గా తేజతో ఫ్రెండ్ షిప్ ,యావర్‌తో డేటింగ్‌,ప్రశాంత్ తో పెళ్లి అని సరదాగా చెప్పేసింది.

- Advertisement -