అమెరికాకు అధికారుల బృందం…

40
- Advertisement -

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అమెరికాలో పర్యటించనుంది. ఈ నెల 27 నుండి సెప్టెంబరు 3 వరకు పర్యటన సాగనుంది. 29 నుండి 31 వరకు ఇల్లినాయిస్ రాష్ట్రంలో జరిగే ప్రతిష్టాత్మక ఫార్మ్ ప్రోగ్రెస్ షో కు హాజరు కానున్నారు.

అమెరికాలో ప్రముఖ వ్యవసాయిక రాష్ట్రం లోవా మరియు నార్త్ కరోలినా, వాషింగ్టన్ డీసీలో క్షేత్రస్థాయిలో పర్యటించనుంది అధికారుల బృందం. అమెరికా ఫెడరల్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, అమెరికా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో భేటీ జరగనుంది. ఆధునిక సాంకేతికత, ఆహార రంగ పరిశ్రమలు, వ్యవసాయ యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం తదితర అంశాలపై అధ్యయనం చేయనున్నారు.

Also Read:MLC Kavitha:ఈసీకి ఫిర్యాదు చేస్తాం

తెలంగాణ వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేయనుంది ఈ అధ్యయనం. భవిష్యత్ లో ఆహార పరిశ్రమలతో రైతులకు వ్యవసాయం మరింత లాభసాటి చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.ఈ మేరకు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం.

- Advertisement -