ట్విట్టర్ సీఈవోకు మంత్రి కేటీఆర్ విషెస్..

138
ktr
- Advertisement -

నూతన ట్విట్టర్ సీఈవోగా నియమితులైన ప్రవాస భారతీయుడు పరాగ్ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, మైక్రాన్, మాస్ట‌ర్ కార్డ్ సంస్థ‌ల్లో కామ‌న్ ఏంట‌ని కేటీఆర్ ప్ర‌శ్నించిన కేటీఆర్… ఈ అంత‌ర్జాతీయ కంపెనీల‌న్నింటికి ఇండియాలో పుట్టి పెరిగిన వారే సీఈవోలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.

ఐఐటీ బాంబే, స్టాన్‌‌ఫోర్డ్‌ విశ్వ‌వి‌ద్యా‌లయం పూర్వ విద్యార్థి అయిన పరాగ్‌ అగ‌ర్వాల్‌.. పదేండ్ల క్రితం ట్విట్ట‌ర్‌లో యాడ్స్‌ ఇంజి‌నీ‌ర్‌గా చేరారు. అంచె‌లం‌చె‌లుగా ఎదు‌గుతూ 2017లో సంస్థ టెక్నా‌లజీ అధి‌ప‌తిగా పదో‌న్నతి పొందారు. ఈ బాధ్యత నాకు రావ‌డం‌పట్ల గర్వ‌ప‌డు‌తు‌న్నాను. డోర్సే మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని కొన‌సా‌గి‌స్తాను. ఆయన స్నేహా‌నికి కృత‌జ్ఞ‌తలు అని తెలిపారు పరాగ్.

2006లో మరో ముగ్గు‌రితో కలిసి డోర్సే ట్విట‌ర్‌ను స్థాపిం‌చిన విషయం తెలి‌సిందే. అప్ప‌ట్నుంచి ఇప్ప‌టి‌దాకా ట్విట్టర్‌ సార‌థిగా డోర్సేనే కొన‌సా‌గు‌తు‌న్నారు. దాదాపు 16 ఏండ్ల అనం‌తరం సంస్థకు కొత్త సీఈవోగా ఓ భారతీయుడికి అవకాశం లభించడం విశేషం

- Advertisement -