రక్తదాతలకు ఉచిత ప్రయాణం..

69
sajjanar
- Advertisement -

రక్తదాతలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. మంగళవారం ఆర్టీసీ నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని తెలిపారు. జేబీఎస్‌లో ఉదయం 9గంటలకు రక్తదాన శిబిరాన్ని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించన్నట్లు తెలిపారు.

టీఎస్‌ ఆర్టీసీ, రెడ్‌ క్రాస్‌ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్‌, ఎంజీబీఎ్‌సలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

- Advertisement -