లాలాపేట్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన…

168
ktr
- Advertisement -

హైదరాబాద్ భారీ వర్షాలతో ముంపుకు గురైన ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతూనే ఉంది. లాలాపేట్‌లో ఇవాళ పర్యటించారు మంత్రి కేటీఆర్‌. స్ధానిక ఎమ్మెల్యే,డిప్యూటీ స్పీకర్ పద్మారావు్‌ గౌడ్‌తో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందజేసిన కేటీఆర్ వాఇరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగ ఉండాలని సూచించారు. ఓవైపు ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూనే మరోవైపు వరద కట్టడికి, కాలనీలను శుభ్రం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ముమ్మరంగా కొన‌సాగుతోంది. తొలిరోజు 1036 మందికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించినట్లు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు.

- Advertisement -