దుబ్బాక అభివృద్ధి…కరపత్రం రిలీజ్

203
harishrao
- Advertisement -

దుబ్బాక లో టి.ఆర్.యస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది ఎన్నారై టి.ఆర్.యస్ యూకే బృందం. ఈ సందర్భంగా టి.ఆర్.యస్ ప్రభుత్వ పాలనలో దుబ్బాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పనులతో కూడిన కర పత్రాన్ని మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా విడుదల చేశారు.

గతం లో తెలిపిన విధంగా ఇంటింటి ప్రచారం లో భాగంగా టి.ఆర్.యస్ హయాం లో దుబ్బాకలో జరిగిన అభివృద్ధిని ఇంటింటికి తిరిగి చెప్తున్నామని, అలాగే భవిష్యత్తు లో కూడా దుబ్బాక అభివృద్ధి టి.ఆర్.యస్ పార్టీ తోనే సాధ్యమని ప్రజలకు చెప్తూ సోలిపేట సుజాత గారిని లక్ష మెజారిటీ తో గెలిపించుకుంటామని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ మరియు రత్నాకర్ కడుదుల తెలిపారు.

ఎంతో బాధ్యతతో దుబ్బాకలో ప్రచారం నిర్వహించటానికి రావడమే కాకుండా టి.ఆర్.యస్ ప్రభుత్వ పాలనలో దుబ్బాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధి పనులతో కూడిన కర పత్రాన్ని రూపొందించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న ఎన్నారై టి.ఆర్.యస్ యూకే ప్రతినిధులను మంత్రి హరీష్ రావు గారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే నాయకులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, శ్రీనివాస్ వల్లాల మరియు స్థానిక నాయకులు బాలకృష్ణ పొగాకు, రాజేష్ భండారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -