ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్వీట్

102
ktr
- Advertisement -

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు మంత్రి కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిపారుదల ప్రాజెక్టు కాళేశ్వరం, మరో ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఏపీలోని పోలవరం, కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఇవ్వాలని కేటీఆర్ కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయహోదాపై ఇప్పటికే సీఎం కేసీఆర్ పలుమార్లు విజ్ఞప్తి చేశారని గుర్తుచేశారు. ఈ మేరకు పలు ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా కల్పించిన అంశంపై కొన్ని పేపర్ క్లిప్పింగులను కూడా మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో పోస్టు చేశారు.

- Advertisement -