KTR:సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు

40
- Advertisement -

సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు అని కొనియాడారు మంత్రి కేటీఆర్. దళితబంధు లాంటి పథకాన్ని ప్రవేపెట్టాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడికే సాధ్యమన్నారు. హైదరాబాద్‌ బేగంపేటలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు టీ ప్రైడ్‌ ద్వారా ప్రోత్సాహకాలు, అవార్డులు అందజేశారు.

బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తుచేశారు కేటీఆర్. అందరికీ ఒకే ఓటు హక్కు ఉండాలని బాబాసాహెబ్‌ ఆలోచించారని …ఆయన ముందుచూపుతో స్త్రీలకు పురుషులతో సమానంగా ఓటు హక్కు వచ్చిందన్నారు.

తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తుందన్నారు. తెలంగాణ పథకాలైన రైతుబంధు, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. రాష్ట్రంలో దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. దళితబంధు పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు నిండాయని, పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారని చెప్పారు. దళితబంధు యూనిట్లను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయన్నారు. సీఎం కేసీఆర్‌ మొండిగా ముందుకెళ్లి నాలుగేండ్లలోనే ప్రాజెక్టును పూర్తిచేశారని తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -