ఈ ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంది- కేటీఆర్‌

92
ktr
- Advertisement -

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన జయంతి ఉత్సవాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి వ్య‌తిరేకంగా పోరాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన సంస్థ‌ల‌ను త‌మ ఆధీనంలో పెట్టుకుని రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల మీద‌కు వేట కుక్క‌ల మాదిరిగా ఉసిగొల్పుతున్న కార్య‌క‌లాపాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుదాద‌మ‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

హైద‌రాబాద్ న‌డిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ఉన్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని డిసెంబ‌ర్ చివ‌రి నాటికి ప్ర‌తిష్టించ‌బోతున్నామ‌ని తెలిపారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అంబేద్క‌ర్ వాదులంద‌రూ.. హైద‌రాబాద్ వైపు చూసే రోజు త్వ‌ర‌లోనే రాబోతుంద‌న్నారు. అంబేద్క‌ర్ క‌ల‌లుగ‌న్న స‌మాజం తెలంగాణ‌లో ఆవిష్కృతం కాబోతుంద‌న్నారు. ద‌ళిత పారిశ్రామివేక‌త్త‌ల‌కు అండ‌గా నిల‌బ‌డేందుకు టీ ప్రైడ్ ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కం కింద 200 కోట్ల రాయితీల‌ను 3 వేల మంది ద‌ళిత పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అందిచామ‌ని తెలిపారు.

అధికార వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా కొత్త జిల్లాల‌ను, రెవెన్యూ డివిజ‌న్ల‌ను, మండ‌లాల‌ను ఏర్పాటు చేసుకున్నాం. గిరిజ‌న సోద‌రుల కోసం తండాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా తీర్చిదిద్దాం. ఈ ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. భార‌తీయుల కోసం అంబేద్క‌ర్ ఒక్క‌టే రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగం ప‌ట్ల అంద‌రికీ గౌర‌వం ఉంది. కానీ కొంద‌రు రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్నారు. వారి గురించి మ‌నం ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

ఎస్సీ విద్యార్థుల కోసం గురుకులాల‌ను స్థాపించి, అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య చ‌రిత్ర‌లో ఏ ప్ర‌ధాని, ఏ ముఖ్య‌మంత్రి ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌లేదు. మంచి ప‌నులు చేస్తున్న ప్ర‌భుత్వాన్ని అభినందించాలి. అంబేద్క‌ర్ జ‌యంతి అంటే భ‌య‌పెట్టే ప‌రిస్థితులు తేవొద్దు. ద‌ళితుల కోసం చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని కేటీఆర్ సూచించారు.

- Advertisement -