దేవాలయల్లో మానసిక ప్రశాంతత- మంత్రి

86
Minister Indrakaran Reddy
- Advertisement -

నిర్మల్ పట్టణం బెస్తవార్ పెట్ లో రూపాయలు 25 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న శివాలయనికి గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయల్లో మానసిక ప్రశాంతత ఉంటుంది.. బెస్తవార్ పెట్ శివాలయం పురాతనమైనదని 25 లక్షల దేవాదాయ శాఖ నిధులతో నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే గాంధీచౌక్‌లో హనుమాన్ ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్నామని మంత్రి అన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో 600 కు పైగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.బంగల్ పెట్ మహాలక్ష్మి ఆలయం 60 శాతం పనులు పూర్తయ్యాయని అన్నారు.

అనంతరం శివాలయానికి శివసాయి లైట్ హౌస్ వారు లక్ష రూపాయలు, పతికే శ్రీను లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినదుకు వారిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము,స్థానిక కౌన్సిలర్లు ఎడిపెళ్ళి నరేందర్, మేడారం అపర్ణ ప్రదీప్, పట్టణ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -