నడ్డా, షా అందుకే రాలేదు : కేటీఆర్ ఫైర్

180
ktr
- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి త్వరలోనే పాన్ ఇండియా సినిమా చూపిస్తామని, అందులో విస్ఫోటక సమాచారంతోపాటు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే తమ ఎమ్మెల్యేలు నలుగురిని చేర్చుకోవడం ద్వారా టీఆర్ఎస్‌ను నైతికంగా దెబ్బకొట్టాలన్న బీజేపీ పన్నాగాన్ని తిప్పికొట్టినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో మునుగోడులో సభ నిర్వహించి ఆ నలుగురినీ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారని, కానీ బెడిసికొట్టడంతో సభను రద్దు చేసుకున్నారని అన్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీఆర్ఎస్‌కు పునాది అవుతుందని కేటీఆర్ అన్నారు. సరైన నాయకత్వం, పోరాట పటిమ లేని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండడం బీజేపీ అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు ఎరకు సంబంధించి త్వరలోనే మొత్తం సినిమా బయటకు వస్తుందని అన్నారు. మునుగోడులో ఓటమి ఖాయమనే నడ్డా, అమిత్ షా ప్రచారానికి రాలేదని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మఠాధిపతులను వినియోగించుకోవడం ద్వారా హిందూ మతానికి బీజేపీ చెడ్డపేరు తెస్తోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్‌రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.

బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేటీఆర్.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌పైనా తీవ్ర విమర్శలు చేశారు. దేహదారుఢ్యం కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ బిజీగా ఉంటే రాహుల్ మాత్రం ఇతర ప్రాంతాల్లో తిరుగుతున్నారని అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కోల్పోతోందన్నారు.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -