KTR:రైతులకు అండగా ప్రభుత్వం

45
- Advertisement -

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్.రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని చెప్పారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా సీఎం కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు.

ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులంతా క్షేత్రస్థాయిలో పర్యటించి స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Also Read:వేయి మందితో బాలయ్య కొట్టుడు

దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. సిరిసిల్ల జిల్లాలో వర్షాలపై సమీక్ష నిర్వహించారు కేటీఆర్. అనుకోకుండా కురిసిన ఈ అకాల వర్షాల వలన నష్టపోయిన జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు.

Also Read:‘ఎన్టీఆర్ 30’.. మళ్లీ లీకుల కలకలం

- Advertisement -