అధికారులు అప్రమత్తంగా ఉండాలి- మంత్రి కేటీఆర్‌

174
ktr
- Advertisement -

రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై కలెక్టర్ కృష్ణబాస్కర్, ఎస్పీ రాహుల్ హెగ్డే లతో ఫోన్లో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు మూడు రోజులు కూడా భారీగా వానలు పడే అవకాశం ఉంటుందన్న వాతావరణ శాఖ వారి హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, క్షేత్ర స్థాయి అధికారులు స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద తగు హెచ్చరికలను, వేరే దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేయాలన్నారు.

గ్రామాల్లోనూ పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వర్షకాలంలో గ్రామాల మధ్య ఉన్న చిన్నచిన్న వాగులను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎగువ మానేరు జాలశయ నీటి మట్టం పూర్తి స్థాయిలో నిండి మత్తడి దుంకుతుందని, జలాశయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -