అన్నివర్గాలను ఏకం చేసిన ‘దీక్షా దివస్‌’:కేటీఆర్

136
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నేటితో పదకొండేళ్లు. దీక్షా దివస్‌ సందర్భంగా ప్రజలకు శుభాక్షాలు చెబుతున్నారు తెలంగాణ మంత్రులు,ఎమ్మెల్యేలు. మంత్రి కేటీఆర్ సైతం దీక్షా దివస్ సందర్భంగా విషెస్ తెలిపారు. అది ఒక అపూర్వ ఘట్టమని, యావత్‌ తెలంగాణ ప్రజలను, అన్నివర్గాలను దీక్ష ఏకం చేసిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దీక్షా దివస్‌-నవంబర్‌ 29. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన ఒక అపూర్వ ఘట్టం. తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన దీక్ష. తెలంగాణ ప్రజానీకానికి దీక్షా దివస్‌ శుభాకాంక్షలు అని తెలిపారు కేటీఆర్.

- Advertisement -