ప‌వ‌న్ హాన్స్‌ విక్ర‌యంపై కేంద్రాన్ని ప్రశ్నించిన కేటీఆర్‌..

58
ktr
- Advertisement -

భార‌త ప్రభుత్వం, ఓఎన్జీసీ సంయుక్త ఆధ్వర్యంలోని ప‌వ‌న్ హాన్స్‌ సంస్థలోని తన వాటాను ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హెలికాప్టర్ సేవ‌ల‌ను అందిస్తున్న ఈ సంస్థ లాభాల బాట‌లో సాగుతుండగా కేంద్రం తన వాటాను ఓ మామూలు ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యించిన తీరును మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

లాభాల బాట‌లో సాగుతున్న ప‌వ‌న్ హాన్స్‌ను ప్రైవేట్ కంపెనీకి విక్ర‌యించాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ప్ర‌శ్నించారు మంత్రి కేటీఆర్‌. 2017లో రూ.3,700 కోట్ల నిక‌ర విలువ క‌లిగిన‌ ప‌వ‌న్ హాన్స్‌ లోని తన వాటాను కేవ‌లం రూ.211 కోట్ల‌కు విక్ర‌యించిన తీరును కూడా ఆయన ఎత్తి చూపారు.

ఇక ప‌వ‌న్ హాన్స్‌ను కొనుగోలు చేసిన కంపెనీ ఆరు నెల‌ల క్రితం కేవ‌లం కూ.1 ల‌క్ష కేపిట‌ల్‌తో ప్రారంభ‌మైందని, ఈ కారణంగా ఈ డీల్‌పై ప్ర‌శ్న‌ల‌తో పాటు అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని కేటీఆర్ తెలిపారు.ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్రం వ‌ద్ద ఏమైనా స‌మాధానాలు ఉన్నాయా? అని కూడా కేటీఆర్ ప్ర‌శ్నించారు.

- Advertisement -