తెలంగాణకు కర్త,కర్మ,క్రియ సీఎం కేసీఆర్: మంత్రి కేటీఆర్

224
ktr
- Advertisement -

తెలంగాణకు కర్త,కర్మ,క్రియ అన్నీ సీఎం కేసిఆర్ అన్నారు మంత్రి కేటీఆర్. వంద సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా పార్టీ నిర్మాణం జరుగుతోందని…..20 ఏళ్లలో పార్టి ఎన్నో ఓడి దుడుకులు ఎదుర్కొంది ..జలదృశ్యం నుంచి గెంటి వేయబడ్డ పార్టీ మనదన్నారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్……కార్యకర్తల శ్రమ,పట్టుదల కారణం గానే ఈ స్థాయికి వచ్చిందన్నారు. కార్యకర్తలను ఆదుకునే స్థాయికి టిఆర్ ఎస్ వచ్చింది…రు.16.11 కోట్లు ప్రీమియం మొత్తంగా బీమా కంపెనీ కి చెల్లించామని చెప్పారు. తెలంగాణ సాధించే వరకు ఎన్నో అటు పోట్లతో ఈ స్థాయికి చేరుకుంది..రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపండి అని ధైర్యం నింపిన నేత కేసీఆర్ అన్నారు.

13 ఏళ్ళు ఎన్నో కుట్రలు ఎదుర్కొన్నాం…స్వీయ రాష్ట్ర ఆస్తిత్వమే మనకు రక్ష అని జయశంకర్ సర్ ఎన్నో సార్లు చెప్పారు..రాష్ట్రం బహుముఖాభివృద్ది మా లక్ష్యం..పార్టీ కార్యకర్తల శ్రమ ,పట్టుదల మాములు త్యాగాలు కావన్నారు. కేసీఆర్ స్థాపించిన ముహూర్త బలం మరో వందేళ్లు పార్టీ బలంగా ఉండేలా ఉందికార్య కర్తల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టే యోచన లో ఉన్నాం అన్నారు.టిఆర్ఎస్ దేశంలో అజేయ మైన శక్తిగా ఎదిగింది….టిఆర్ ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి గా మారిందన్నారు.

పార్టీ కార్యకర్తలను ఆదుకునే చర్యలు ఎమ్మెల్యేలు చేపట్టాలి….వారి ఇళ్లకు వెళ్లి సమస్యలు పార్టీ దృష్టికి తీసుకురండి…త్వరలో జిల్లా కార్యాలయాలు ప్రారంభిస్తాం అన్నారు.కరోనా కారణంగా కార్యకర్తల శిక్షణ వాయిదా వేసుకున్నాం …ప్రజలకు, ప్రభుత్వానికి అనుసందానంగా కార్యకర్తలు ఉండాలన్నారు.

కరోనాలో ప్రజలను ఆదుకునే చర్యలు తీసుకోవాలి….ప్రభుత్వ పరంగ ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం….నేతలు శాయా శక్తుల మేరకు ప్రజలను ఆదుకోవాలన్నారు.వ్యక్తిగతంగా సహాయం చేయాలనే నా పుట్టిన రోజు సందర్భంగా అంబులెన్సు లు ఇచ్చాం…కరోనా సంక్షోభం ముగిసే వరకు ప్రజలకు సేవలు అందించాలి…కాంగ్రెస్, బీజేపీ నేతలు పదవులు దక్కడం టి ఆర్ ఎస్ పుణ్యమే…కెసిఆర్ మీద మాట తూలే ముందు గుర్తించుకోవాలన్నారు.

- Advertisement -