లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం..

61
- Advertisement -

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయని, భారతరత్న లతా మంగేష్కర్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. భారతదేశ సినీ సంగీత అభిమానులకు దశాబ్దాలపాటు ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన లతాజీ మరణం తీరని లోటు అని అన్నారు. లతాజీ అందించిన అద్భుతమైన పాటల రూపంలో ఆమె వారసత్వం శాశ్వతంగా నిలిచి ఉంటుందన్న మంత్రి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. లతాజీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -