కరోనా కట్టడి కోసం వరల్డ్ హెత్త్ ఆర్గనైజేషన్ ప్రారంభించిన సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. తాజాగా తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. చేతులు కడుక్కుంటున్న వీడియోను ట్వీట్టర్లో పోస్ట్ చేశారు.
ఈసందర్భంగా మరో ఆరుగురికి ఈ సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ ను విసిరారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు హర్ధిప్ సింగ్ పూరీ, పియుష్ గోయల్, ఏపీ సీఎం జగన్, అమితాబ్ బచ్చన్, సేల్స్ ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ కు ఛాలెంజ్ విసిరారు. కరోనా నియంత్రణ కోసం గత వారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ టెడ్రోస్ అతనం ఈ ఛాలెంజ్ ను ప్రారంభించారు.
Challenge gladly accepted! Here’s my video of #SafeHandsChallenge
Personal hygiene is very important to #BreakTheChain and containing #CoronaVirus #COVID19outbreak
I nominate HPM @narendramodi Ji @HardeepSPuri Ji @SrBachchan Ji @Ysjagan Garu @PiyushGoyal Ji and @Benioff pic.twitter.com/3XNCRCJVY8
— KTR (@KTRTRS) March 23, 2020