సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప‌నుల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న

80
- Advertisement -

న‌ల్ల‌గొండ జిల్లా నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద సుంకిశాల ఇన్‌టెక్ వెల్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…హైద‌రాబాద్ రంగారెడ్డి మేడ్చ‌ల్ జిల్లాల ప్ర‌జ‌ల‌కు నిజంగా ఇవాళ‌ శుభ‌దినం అని పేర్కొన్నారు. మెట్రో వాట‌ర్ స‌ప్లై, సీవ‌రేజ్ బోర్డు ఆధ్వ‌ర్యంలో రూ. 6 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయన్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రానికి 2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందు చూపుతో ప్ర‌ణాళిక‌లు రూపొందించామ‌న్నారు. ఏడేండ్లు క‌రువు వ‌చ్చినా తాగునీటికి తిప్ప‌లు లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. భ‌విష్య‌త్‌లో హైద‌రాబాద్ న‌గ‌రం 100 కిలోమీట‌ర్ల విస్త‌రించిన తాగునీటికి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

సుంకిశాల‌లో 1450 కోట్ల అంచ‌నా వ్య‌యంతో తాగునీటి అవ‌స‌రాల నిమిత్తం పంపులు, మోటార్లతో పాటు అద‌నంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయ‌డానికి ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

- Advertisement -