సివిల్స్ విజేత‌ల‌కు మంత్రి కేటీఆర్ విషెస్

79
KTR
- Advertisement -

2021 సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారిని అభినందించారు మంత్రి కేటీఆర్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్….సివిల్స్‌లో అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన టాప్ ముగ్గురు అమ్మాయిల‌కు విషెస్ చెప్పిన కేటీఆర్… రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన వారిని మెచ్చుకున్నారు. మీ ప్ర‌తిభ‌, ప్ర‌య‌త్నాల‌తో ఈ దేశాన్ని మీరు ముందు ఉండి న‌డుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

సివిల్స్ 2021లో టాప్ మూడు స్థానాల‌ను అమ్మాయిలే కైవ‌సం చేసుకున్నారు. భూపాలప‌ల్లికి చెందిన యువ‌కుడు న‌రేశ్‌కు 117వ ర్యాంక్, నిజామాబాద్ యువ‌తి స్నేహ‌కు 136వ ర్యాంకు, సూర్యాపేట‌కు చెందిన చైత‌న్య‌రెడ్డికి 161వ ర్యాంకులు వ‌చ్చాయి.

- Advertisement -