ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శ‌ం- మంత్రి కేటీఆర్

191
ktr
- Advertisement -

నూతన రెవెన్యూ చట్టం గురువారం నుంచి అధికారికంగా అమలుకాబోతున్నది. భూమి రికార్డులన్నింటినీ నిక్షిప్తంచేసిన ‘ధరణి’ పోర్టల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మూడు చింతలపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్వీట్ చేశారు. స‌మీకృత భూరికార్డుల నిర్వ‌హ‌ణ విధానంలో ధ‌ర‌ణి పోర్ట‌ల్ కీల‌క‌మ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

అవినీతికి ఆస్కారం లేని పూర్తి పార‌ద‌ర్శ‌క విధానంలో లావాదేవీలు జ‌ర‌ప‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని కేటీఆర్ తెలిపారు. ఈ విధానం ద్వారా ఏక‌కాలంలో రిజిస్ర్టేష‌న్లు, మ్యుటేష‌న్లు జ‌రుగుతాయ‌న్నారు. రాష్ర్ట ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ దేశానికే ఆద‌ర్శ‌కంగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభించ‌నున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్ చిర‌స్థాయిగా నిలుస్తుంద‌న్నారు.

- Advertisement -