బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ: కొప్పుల

100
koppula
- Advertisement -

బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ అన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. దళితుల ప్రాణాలు తీసిన చరిత్ర బిజెపిది అన్నారు. మనువాద బీజేపీని ప్రజలు తరిమి కొడతారన్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దళితులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పచ్చగా ఉన్న తెలంగాణలో బిజెపి చిచ్చు పెడుతుందని…సోషల్ మీడియా భూతంతో బీజేపీ అబద్ధాల ప్రచారం చేపట్టిందన్నారు. సీఎం కేసీఆర్ పై బిజెపి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన మనువాద భావాలు కలిగిన శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన బిజెపి పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో దళితులు, మైనార్టీల ను ఊచకోత కోసిన పార్టీ బీజేపీ అన్నారు.

- Advertisement -