తెలంగాణ కొత్త సచివాలయంపై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయ గుమ్మటాలను కూల్చివేస్తామని ప్రకటించారు. సచివాలయాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించేలా మార్పులు చేస్తామని అన్నారు. శుక్రవారం కార్నర్ మీటింగ్ లో భాగంగా ఓల్డ్ బోయినపల్లిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన సచివాలయ డోమ్ లను కూల్చివేస్తామన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధరరెడ్డి స్పందించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే నూతన సచివాలయాలన్ని నిర్మిస్తున్నామని … ద్వేష భావంతో, కేసీఆర్ ను వ్యతిరేకించాలన్న సింగిల్ అజెండాతో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న నూతన సచివాలయాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 17న పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ కూడా నిర్వహించనుంది.
ఇవి కూడా చదవండి..