దివ్యాంగుల కోసం వినూత్న పథకాలు: మంత్రి కొప్పుల ఈశ్వర్

169
koppula
- Advertisement -

హుజురాబాద్ మార్కెట్ యార్డ్ ఆవరణలో హుజురాబాద్ డివిజన్ కు సంబంధించిన 623 మంది దివ్యాంగులకు తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో సుమారు రెండు కోట్ల విలువ గల ఉచిత సహాయక ఉపకరణాలను బ్యాటరీ వీల్‌చైర్లు, చేతికర్రలు, త్రీవీలర్‌, వినికిడి యంత్రాలు, స్కూటీలు మొదలగు పరికరాలు అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేసి, అనంతరం వారితో కలిసి భోజనం చేసిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…సమైక్య పాలనలో వికలాంగులను పట్టించుకోలేదు. వికలాంగుల శాఖ మొక్కుబడిగా ఉండేది, వారి అవసరాలను తీర్చేది కాదన్నారు. దివ్యాంగులను కన్నబిడ్డల్లా అక్కున చేర్చుకున్న ఘనత సిఎం కెసిఆర్ ది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. దివ్యాంగుల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ అగ్రభాగంలో ఉన్నది. దివ్యాంగులకు బాసటగా నిలవడమే తెలంగాణ ప్రభుత్వ ఆశయం. సాటి మనిషి కష్టం, బాధ అర్థం చేసుకొని తీర్చగలిగినప్పుడే మానవ జన్మకు అర్థం, పరమార్థం ఉంటాయని సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. వారి ముఖాల్లో చిరునవ్వు ఉంటేనే ప్రభుత్వంగా మాకు ఆత్మ సంతృప్తి ఉంటుందన్నారు.

దివ్యాంగులకు వినూత్న సంక్షేమ పథకాలు అమలుచేస్తూ దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందున్నదని చెప్పారు. దివ్యాంగుల్లో ఆత్మగౌరవాన్ని పెంచడంతోపాటు.. ఎవరి సాయం లేకున్నా బతకగలమనే ఆత్మైస్థెర్యాన్ని వారిలో నింపిందని పేర్కొన్నారు. వికలాంగులకు రూ.3,016 పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు.ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలకు హాజరైనా కలగని ఆత్మసంతృప్తి ఈ కార్యక్రమంలో కలుగుతున్నదన్నారు. రూ. 2 కోట్లతో 623 మంది దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని చెప్పారు.

- Advertisement -