విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు: మంత్రి కొప్పుల

123
koppula
- Advertisement -

కాచిగూడ (నింభోలిఅడ్డ) ఎస్సీ బాలుర హాస్టల్‌ విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌. వివిధ కోర్సుల పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు పూర్తయ్యాక మరమ్మతులు చేపట్టాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులు మంత్రి కొప్పుల ఆదేశించారు.

చాలా ఏండ్ల కిందట నిర్మించిన వసతి గృహానికి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ఇటీవల అధికారులు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు విద్యార్థులు మంత్రిని కలిసి డిగ్రీ, పీజీ, లా పరీక్షలు ఉన్నందున మరమ్మతులను వాయిదా వేయాలని, భోజన వసతిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -