కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి..

248
Minister Koppula Eshwar
- Advertisement -

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు శుక్రవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల తల్లికే కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులు ఇస్తున్నాం అన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారం కాకుడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టి పేదలకు అండగా నిలుస్తుందన్నారు. అలాగే కాన్పు సమయంలో‌ అంగన్ వాడీల‌ ద్వారా పాలు, గుడ్లు, మంచి భోజనాన్ని గర్భిణీ స్త్రీలకు పోషకాహార రూపంలో అందజేస్తున్నామని ప్రసవ‌సమయంలో ప్రభుత్వాసుపత్రికి‌ తెస్తే పన్నెండు‌‌ వేల రూపాయలు, కేసీఆర్ ‌కిట్, అందజేస్తున్నామన్నారు.

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పేరులు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దన్నారు ఎవరి ద్వారా మోసపోవద్దని ప్రజలకు హితవు పలికారు. ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత, తెరాస పార్టీ రాష్ట్ర నాయకులు రమణారావు, MPP గోళి శోభ సురేందర్ రెడ్డి, ZPTC రాజేందర్ రావు, వైస్ MPP గాజుల గంగాధర్, మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -