కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి మంత్రి హరీశ్ రావు లేఖ

56
harish
- Advertisement -

కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుండి 6 నెలలకు తగ్గించాలన్నారు. హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు.

60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్ తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరునికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోస్ పాలసీలు, వాటి ఫలితాల ఆధారంగా పై ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈ విజ్ఞాపను పరిగణనలోకి తీసుకోవాలని వెల్లడించారు.

- Advertisement -