క్రికెటర్ హరీశ్ రావు…

241
harishrao
- Advertisement -

టీఆర్ఎస్ ట్రబూల్ షూటర్,మంత్రి హరీశ్‌ రావు క్రికెటర్ అవతారమెత్తారు. ఎప్పుడు ప్రజా సమస్యలు,సమీక్షలతో బిజీగా ఉండే హరీశ్‌ సిద్దిపేట వాసులను అలరించారు. సిద్దిపేట మినీ స్టేడియంలో బుధవారం రాత్రి నిర్వహించిన టీ–20 ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌లో పాల్గొన్నారు.

ఈ మ్యాచ్‌లో సిద్దిపేట జిల్లా జట్టుకు మంత్రి హరీశ్‌ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హైదరాబాద్‌ మెడికవర్‌ డాక్టర్స్‌ జట్టుకు డాక్టర్‌ కృష్ణకిరణ్‌ సారథ్యం వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన హరీశ్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హైదరాబాద్ జట్టు 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

- Advertisement -