వడ్ల కొనుగోళ్లపై కేంద్రం లెటర్ ఇవ్వాలి: హరీష్ రావు

192
harish
- Advertisement -

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం ఒక లెటర్ ఇవ్వాలని… కేంద్రం తీరుతో తడిసిన వడ్లు కొనలేక పోతున్నాం అన్నారు మంత్రి హరీష్‌ రావు. నారాయణ ఖేడ్ లో పర్యటించిన హరీష్ రావు…. వడ్ల కొనుగోలు విషయం లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో కొనుగోళ్లు కేంద్రాలెన్ని, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలెన్ని? అని ప్రశ్నించారు

సంగారెడ్డి జిల్లాలో 70 శాతం పంట కొనుగోలు పూర్తి చేశాం. ఇంకా 30 శాతం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 157 కొనుగోళ్లు కేంద్రలు ప్రారంభించాం అని తెలిపారు. బీజేపీ కి, కాంగ్రెస్ కు కొనుగోలు పై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. వడ్లు కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనన్నారు.

పీయూష్ గోయల్‌దో వైఖరి ఒకలా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు మరోలా ఉంటున్నాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు బాంధవుడు…నారాయణఖేడ్‌కు తాగు, సాగు నీటి ఇవ్వాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 70 ఏళ్ళు అధికారం ఉన్న కాంగ్రెస్ త్రాగునీరు సాగు నీరు అందిచలేదన్నారు.రైతు బంధు క్రింద నారాయణఖేడ్ కు 200 కోట్లు టీఆర్ ఎస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.

రైతులను పాటించుకొని ప్రభుత్వాలు కాంగ్రెస్ , బీజేపీ వి అని మండిపడ్డ హరీష్‌ రావు సింగూర్ ప్రాజెక్టు ద్వారా లిఫ్ట్ పెట్టి సంగారెడ్డి జిల్లా కు నీరు అందిస్తాం అన్నారు. 4400 కోట్లతో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తాం అన్నారు.

- Advertisement -