సిద్దిపేట బురుజుపై జాతీయజెండా ఎగురవేసిన మంత్రి హరీశ్‌ రావు..

206
Harish
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. సిద్దిపేట బురుజు పై జాతీయజెండా ఎగురవేశారు మంత్రి హరీశ్‌ రావు. సిద్దిపేట బురుజుపై జాతీయజెండా ఎగుర వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. చారిత్రాత్మక కట్టడాలను కాపాడుకోవలనే ఉద్దేశంతో వాటిపై జాతీయ జెండా ఎగురవేశామన్నారు.

డాక్టర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించడం వల్ల అట్టడుగు వర్గాల వారు చట్టసభల్లో ఉన్నారు…రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కావున దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నాం అన్నారు. పట్టణంలో పందుల బెడద పోయి కోతుల, కుక్కల బెడద పెరగడం వల్ల వాటి నియంత్రణ కోసం చర్యలు చేపడుతున్నాం అన్నారు.

ఏ వార్డులోని చెత్త ఆ వార్డులోనే ఎరువుగా తయారు చేయడం గొప్పవిషయం అన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించి స్టీల్ బ్యాంక్ లను వాడండి అని సూచించారు. పట్టణంలోని ప్రతి పౌరుడు వెళ్లే స్కూలే స్వచ్ఛ స్కూల్ … మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడు కోవాలి అనేది పిజికల్ గా డిజిటల్ క్లాస్ ద్వారా చూపెట్టేదే స్వచ్ఛ స్కూల్ అన్నారు. ఈ స్కూల్ దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేదు సిద్దిపేట లో తప్ప…స్వచ్ఛ సర్వక్షన్ లో ప్రజల భాగస్వామ్యం అవసరం అన్నారు.

- Advertisement -