గ్రాండ్‌ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్..

196
Minister Harish Rao
- Advertisement -

హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా లో గ్రాండ్ నర్సరీ మేళా ను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా వివిధ జాతులు, విదేశాలకు సంబంధించిన ,హార్టీ కల్చర్, అగ్రికల్చర్ మొక్కల స్టాళ్లను ప్రారంభించి, సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…మెగా హార్టికల్చర్ షో ప్రారంభం అయ్యిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి 120 స్టాళ్లు పెట్టారు..హైదరాబాద్ లో ఉంటున్న నగర వాసులు వీటిని కొనుక్కొని ఇంట్లో పెట్టుకొవచ్చన్నారు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చన్నారు. మొక్కల పెంపకం కోసం చెట్ల పెంపకం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.

నర్సరీ జిల్లాలు, మండలాలు,గ్రామాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు…ఇప్పుడే మంచి నీళ్ళు కొనుకునే పరిస్థితి ఉందన్నారు. గాలి అనేది చాలా అవసరం..అందుకే ప్రతి ఇంటి దగ్గర మొక్కలు చెట్లు పెంచాలన్నారు. తర్వాత రోజుల్లో ఆక్సిజన్ కొనుకునే పరిస్థితి వస్తుందన్నారు. అపార్ట్మెంట్ లో వీటిని పెంచుకోవాలి..పిల్లలకు రాబోయే రోజుల్లో పర్యావరనాన్ని అందించాలన్నారు.

- Advertisement -