ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్‌ ప్రారంభం..:తలసాని

143
talasani
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుండి స్కూల్స్ ,కాలేజి లు ప్రారంభం అవుతున్నాయని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ పశుసంవర్ధక భవన్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ,ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలలోని విద్యార్థులకు పంపిణీచేసేందుకు తన సొంత నిధులతో 55 వేల మాస్క్ లు, శాని టైజర్ లను జిల్లా విద్యాధికారి రోహిణి, ఇంటర్ బోర్డ్ జిల్లా విద్యాధికారి జయప్రదలకు,విద్యార్థులకు అందజేశారు తలసాని.

ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. తలసాని ట్రస్ట్ ద్వారా 55 వేల మాస్కులు ,సానీటైజర్ పంపిణీ చేస్తున్నాం అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సానీటైజర్ ,మాస్క్ తప్పనిసరి….తల్లిదండ్రులు పిల్లల గురించి ఎలాంటి ఆందోళన చెందకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. తల్లిదండ్రులకు,పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఎవరు అధైర్యపడవద్దన్నారు.

- Advertisement -