నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్‌రావు..

134
Harish-Rao
- Advertisement -

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా సొసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషిచేస్తానని హరీశ్‌ రావు అన్నారు. అందరం కలిసి సొసైటీని ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామన్నారు.

సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని వెల్లడించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా వారిని తీర్చిదిద్దుదామని చెప్పారు. గత 80 ఏండ్లుగా ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్‌ రావుకు సొసైటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -