ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదాం: హరీష్‌

152
Aids
- Advertisement -

ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదాం అని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఎర్ర గడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు…ఎయిడ్స్ మరణాల సంఖ్య తగ్గించగలగాలన్నారు. ఎయిడ్స్ రోగుల పట్ల చిన్న చూపు చూడొద్దన్నారు. గాలి ద్వారా తాకడం ద్వారా ఎయిడ్స్ రాదని… ఎయిడ్స్ రాకుండా అవగాహన పెంచుదాం అన్నారు.

ఎయిడ్స్ రోగులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం అని తెలిపారు హరీష్ రావు. తెలంగాణ ప్రభుత్వం ఎయిడ్స్ రోగులకు ప్రతినెలా రెండు వేల పదహారు రూపాయలు పింఛన్ అందిస్తున్నాం అన్నారు. 1.30 లక్షల మంది ఎయిడ్స్ రోగులు ఉన్నారు… 70 వేల మందికి మందులు పంపిణి చేస్తున్నామని చెప్పారు. ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేకంగా వరంగల్, హైదరాబాద్ లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశాం అన్నారు. చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో కార్పొరేట్ స్థాయి ఆస్పత్రి పేద ప్రజలకు అందుబాటులోకి రాబోతుందన్నారు. నర్సింగ్ వృత్తిలో ఉన్న విద్యార్థులకు నెలనెలా స్టైఫండ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

- Advertisement -